17 April, 2026 | 3:19 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

వడ్డీ వ్యాపారులలో గుబులు...!

29-04-2025 05:03 PM

జిల్లా కేంద్రంలో ఏ ఎస్ పి చిత్తరంజన్ ఆధ్వర్యంలో పోలీసుల తనిఖీలు...

15 బృందాలు ఏకతాటిగా సౌదాలు... 

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): అనుమతులు లేకుండా చిట్టి నడుపుతున్న, వడ్డీ వ్యాపారుల ఇండ్లలో మంగళవారం ఏఎస్పి చిత్తరంజన్(ASP Chittaranjan) ఆధ్వర్యంలో మూకుమ్మడి దాడులు చేపట్టారు. దీంతో జిల్లా కేంద్రంలో కలకలం రేగింది.పోలీసులు ఆకస్మికంగా దాడులు చేపట్టడంతో వ్యాపారుల్లో గుబులు మొదలైంది. 15 బృందాలు ఒకసారిగా వ్యాపారుల నివాసాలలో సౌధాలు చేపట్టారు. వడ్డీ వ్యాపారం, చిట్టి నిర్వాణపై ఆరా తీశారు. నిబంధనలకు విరుద్ధంగా చిట్టీ వ్యాపారం, వడ్డీ తిప్పుతున్న వారిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. పోలీసులు ముకుమ్మడి దాడులు చేపట్టడం చర్చనీయాంశమైంది. తనిఖీలు చేపట్టిన పోలీసులు వ్యాపారుల వద్ద నుండి చెక్ బుక్, నగదు, లావాదేవీల రిజిస్టర్ లను స్వాధీన పరుచుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా చిట్టీలు నడిపిన వడ్డీ వ్యాపారం చేసిన చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఏఎస్పి చిత్తరంజన్ తెలిపారు.