9 May, 2026 | 1:09 PM

Breaking News

నిర్బంధ రాజకీయాలకు ముగింపు పలకాలి   •   కాంగ్రెస్ నాయకత్వ చర్చల నడుమ — కేరళ సీఎంపై కొనసాగుతున్న ఉత్కంఠ   •   గోలేటి స్పోర్ట్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా దీకొండ సంజీవ్‌కుమార్   •   ఇంటి పనోళ్ల వివరాలు పోలీస్ స్టేషన్‌లో నమోదు చేయాలి   •   ఐపీఎస్ అధికారి భార్య హత్యకేసులో విచారణ వేగవంతం. రంగంలోకి 10 ప్రత్యేక పోలీసు బృందాలు   •   బెంగాల్‌ సీఎంగా సువేందు అధికారి ప్రమాణస్వీకారం   •   “Back to Question”: సంగారెడ్డి జైలు నుంచి మన్నె క్రిశాంక్ విడుదల   •   నాభి శిల, ముత్యాలమ్మ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   పెద్దమల్లారెడ్డిలో విద్యుత్ షాక్‌తో మహిళ మృతి   •   బొడ్డు కిరణ్‌కు ఆర్థిక సహాయం చేసిన కాంగ్రెస్ నాయకులు   •  

బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డికి పోలీసుల నోటీసులు

13-03-2025 08:20 AM

హైదరాబాద్: బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి(MLC Pochampally Srinivas Reddy)కి మరో షాక్ తగిలింది. పోలీసులు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డికి మరోసారి నోటీసులిచ్చారు. ఈ నేపథ్యంలోనే గురువారం ఉదయం పోలీసులు మాదాపూర్‌లోని శ్రీనివాస్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. మొయినాబాద్ పోలీసులు(Moinabad Police) ఫామ్‌హౌస్‌లో క్యాసినో, కోళ్ల పందాల కేసులో ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డికి నోటీసులు ఇస్తున్నట్లు తెలిపారు.

రేపు మొయినాబాద్‌ పీఎస్‌లో వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. మాదాపూర్ లోని ఆయన నివాసానికి వెళ్లి పోలీసులు నోటీసులు అంటించారు. గత నెలలో తోల్కట్టలోని ఫామ్ హౌస్ లో భారీగా కోడిపందేలు, క్యాసినో నిర్వహించారు. ఈ కేసులో మొత్తం 64 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫామ్ యజమాని పోచంపల్లిని సైతం పోలీసులు నిందితుడిగా చేర్చారు. ఫామ్ హౌస్ లీజుకు ఇచ్చానని గతంలో పోచంపల్లి పోలీసులకు వెల్లడించారు. ఫిబ్రవరి 13న మొదటి సారి మొయినాబాద్ పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు.