27 July, 2026 | 6:31 PM

Breaking News

దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్   •   పైతర పంచాయతీ కార్మికులకు ప్రమాద బీమా పత్రాల పంపిణీ   •   సర్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు   •   విద్యాబోధనలో నూతన విధానాలను అమలు చేయాలి   •   యూనియన్ బ్యాంకులో తెలుగు తెలిసిన సిబ్బందిని నియమించాలి   •   ఎల్ నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి నిత్య కళ్యాణం   •   గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాన్ని అమలు చేయాలి: జడ శ్రీనివాస్   •   డబుల్ బెడ్‌రూం ఇళ్ల సమస్యలపై కలెక్టర్‌కు సీపీఎం వినతి   •   ఎల్ నినో దృష్య వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి   •  

గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడి

23-03-2025 07:52 PM

పారిపోయిన వ్యక్తులు... 

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి నియోజకవర్గంలోని వేమనపల్లి మండలంలో గల బుయ్యారం గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో నిర్వహిస్తున్న గుడుంబా స్థావరాలపై ఆదివారం సాయంత్రం నీల్వాయి ఎస్సై శ్యామ్ పటేల్ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. పోలీసులను చూసి గుడుంబా స్థావరాలు నిర్వహించే వ్యక్తులు అడవిలోకి పారిపోయారని ఎస్సై శ్యాం పటేల్ తెలిపారు. మండలంలోని అటవీ ప్రాంతాల్లో గుడుంబా స్థావరాలు కొనసాగుతున్నట్లు సమాచారం అందడంతోనే ఈ దాడులు నిర్వహించినట్లు చెప్పారు. ఎవరైనా గుడుంబా తయారుచేసి అమ్మితే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.