28-05-2025 10:34:53 PM
రూ.42 వేల నగదు పట్టివేత..
రెండు బైకులు, ఒక సెల్ ఫోన్ స్వాధీనం..
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) ఇనుగుర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో బుధవారం కొందరు పేకాడుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు పేకాట స్థావరంపై దాడి చేశారు. ఈ సందర్భంగా అక్కడ పేక ముక్కలు, 42 వేల రూపాయల నగదు, ఒక సెల్ ఫోన్, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకుని ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు కేసముద్రం ఎస్సై మురళీధర్ రాజ్ తెలిపారు.