28-05-2025 10:33:06 PM
తెదేపా రాష్ట్ర ఆర్గనైజింగ్ మాజీ సెక్రటరీ ముత్తినేని సైదేశ్వర రావు..
కోదాడ: తెలుగుజాతికి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చిన మహనీయుడు ఎన్టీఆర్ అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ముత్తినేని సైదేశ్వర రావు(Muthineni Saideshwara Rao) అన్నారు. బుధవారం ఎన్టీఆర్ 102వ జయంతి సందర్భంగా ఉప్పుగండ్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కోదాడ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా పట్టణంలోని ఖమ్మం క్రాస్ రోడ్ లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పార్టీ నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం భారీ కేక్ కట్ చేసి పేదలకు అల్పాహారాన్ని పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఎన్టీఆర్ తన పాలనలో ప్రజలకు సరికొత్త సంక్షేమ పథకాలు అమలు చేసి పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని సమాజమే దేవాలయం ప్రజలే దేవులు అని చాటి చెప్పిన మహనీయుడు అని ఆయన సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో మాజీ పట్టణ పార్టీ అధ్యక్షులు గుళ్లపల్లి సురేష్, నల్లగొండ పార్లమెంటు పార్టీ కార్యదర్శి కొల్లు నర్సయ్య, మండల పార్టీ అధ్యక్షులు చాపల శ్రీను కొల్లు సత్యనారాయణ గుండు నాగేశ్వరరావు, నెల్లూరు వెంకటేశ్వర్లు, కోదాడ రేవంత్ రెడ్డి, షేక్ బాబా షర్ఫుద్దీన్, చావా హరినాథ్, సజ్జ రామ్మోహన్ రావు, రావిళ్ళ జనార్ధన్, బత్తిని రవీంద్ర, ముండ్రా రవి, కొమ్మినేని నాగేశ్వరరావు, జహీర్, పొందూరు నాగరాజు, చల్లా వెంకటనారాయణ, చల్లా ఏడుకొండలు, జనార్దన్ రెడ్డి, మాదాల రాంబాబు, నర్రా రమేష్, పొనుగుబాటి సీతారామయ్య, సోమపొంగ సహదేవ్, సజ్జ హరిప్రసాద్, చిట్టూరి మాధవరావు, దండా నాగేశ్వరరావు, బుర్రా హనుమంతరావు, నంబూరు లక్ష్మయ్య, బండార అశోక్, కట్ల లింగారావు, బండారు బాబురావు, భావన సత్యం. సిరి పురపు సుభాష్ చంద్రబోస్ పసల వీరయ్య. గాడి పర్తి పూర్ణచంద్రరావు. వాసిరెడ్డి కృష్ణారావు. భాస్కర్ రావు. లింగా జగన్. ముత్తవరపు శ్రీవత్సవ. వెంకటి. వనపర్తి నాగేశ్వరరావు. ముత్తవరపు వెంకయ్య. ఎర్ర నరసయ్య. కోదాటి లక్ష్మీనారాయణ. బెల్లం సుబ్బారావు. నరసింహారావు. సూరిబాబు. సుబ్బారావు. సాయి. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.