పోలీసుల ముమ్మర తనిఖీలు

26-04-2024 01:31:20 AM

వరంగల్ తూర్పు, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): ఎంపీ ఎన్నికలు సమీపి స్తున్న తరుణంలో పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. వరంగల్ ఏసీపీ నందీరాం నాయక్ ఆధ్వర్యంలో గురువారం సబ్ డివిజన్ పరిధిలోని మట్టెవాడ, మిల్స్ కాలనీ, ఇంతేజార్గం జ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో తనిఖీలు చేపట్టి నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీల్లో భాగంగా 8 మంది నుం చి మొత్తం రూ.8,43,100 స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ. 50వేలకు మించి నగదు తీసుకెళ్తే తప్పకుండా ఆధారాలు చూపించాలని సూచించారు. తనిఖీల్లో సీఐలు గోపి, మల్లయ్య, శివకుమార్‌తో పాటు ఎస్సై లు, సిబ్బంది పాల్గొన్నారు.