05-06-2025 11:30:15 PM
కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ పట్టణ కేంద్రాల్లో పోలీసుల ర్యాలీ..
జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర..
కామారెడ్డి (విజయక్రాంతి): శాంతి భద్రతలకు తావు లేకుండా ఉండేందుకు పోలీసులు జిల్లా వ్యాప్తంగా గురువారం రాత్రి ప్రధాన వీధుల గుండా కవాత్ నిర్వహించారు. కామారెడ్డి జిల్లా(Kamareddy District) కేంద్రంలో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర(District SP Rajesh Chandra) మాట్లాడుతూ... బక్రీద్ పండుగ నేపథ్యంలో శాంతియుత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని అందరూ కలిసిమెలిసి మతసామరస్యంతో కూడిన పండుగను జరుపుకునేందుకు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, పట్టణాల్లో పోలీస్ కవాతును నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
సంతోషంగా అందరూ కలిసిమెలిసి శాంతి యుతంగా జరుపుకోవాలని అన్నారు. ఇప్పుడు పెట్రోలింగ్ ద్వారా మేమున్నామని భరోసా కల్పించడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు అందరూ సహకరించాలని ఉద్దేశపురుకంగా ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాట పాడుదే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 170 మంది పోలీసు సిబ్బందితో కలిసి పోలీస్ కవర్ నిర్వహించినట్లు తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమై ఈ పుట్ పెట్రోల్ ముఖ్యమైన అన్ని ప్రాంతాల గుండా వెళ్లడం జరిగిందన్నారు. జెపిఎన్ రోడ్ సుభాష్ రోడ్ మీదిగా పెద్ద బజార్, పాంచ్ రస్తా, కమాన్ రోడ్ నిజాం సాగర్ చౌరస్తా, కొత్త బస్టాండ్ వరకు పోలీసులు పోలీసు కవాతును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి, నరసింహారెడ్డి, వివిధ పవర్ రిజిస్ట్రేషన్ల ఇన్స్పెక్టర్ ఎస్ఐలు ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు.
శాంతి భద్రతల పరిరక్షణ & బక్రీద్ పండుగ సందర్భంగా ఈ ఫుట్ పెట్రోలింగ్ నిర్వహణ..
జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర..
రానున్న బక్రీద్ పండుగ నేపత్యములో శాంతియుత వాతావరణములో, అందరూ కలిసిమెలిసి మతసామరస్యముతో కూడిన పండగను జరుపుకునేందుకు జిల్లా పోలీసు శాఖ ముందస్తు భద్రతా చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ఈరోజు రాత్రి 9 గంటలకు జిల్లా ఎస్పీ శ్రీ యం. రాజేష్ చంద్ర, ఏఎస్పీ శ్రీ బి. చైతన్య రెడ్డి(ASP Chaitanya Reddy), ఇన్స్పెక్టర్స్, సుమారు 170 మంది సిబ్బందితో కలిసి కామారెడ్డి పట్టణములో ఫుట్ పెట్రోలింగ్/కవాతు నిర్వహించడం జరిగింది.
రైల్వే స్టేషన్ నుండి ప్రారంభమైన ఈ ఫుట్ పెట్రోలింగ్ ముఖ్యమైన అన్ని ప్రాంతాల గుండా వెళ్లడం జరిగింది. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో, మసీదులు, మార్కెట్ ప్రాంతాలు, బస్టాండ్ తదితర ప్రదేశాల్లో పోలీసు జాగ్రత్తలు, భద్రతా ఏర్పాట్లను ఎస్పీ ప్రత్యక్షంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ... రానున్న బక్రీద్ పండుగను సంతోషముగా అందరు కలిసిమెలిసి శాంతియుతంగా జరుపుకోవాలని ఎస్పీ సూచించారు.
పోలీసు శాఖ అన్ని అవసరమైన భద్రతా చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ ఫుట్ పెట్రోలింగ్ ద్వారా మేమున్నామనే భరోసా కల్పించడం జరుగుతుందని తెలిపారు. ప్రజలు అందరూ సహకరించాలి. ఉద్దేశపూర్వకంగా ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం అని తెలిపారు. అదేవిధంగా ఎల్లారెడ్డి, బాన్సువాడ పట్టణ కేoద్రంలో కూడా సంబంధిత డియస్పి విట్టల్ రెడ్డి, ఇన్స్పెక్టర్లు, యస్ఐలు సిబ్బందితో కలిసి ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు.