13-10-2025 12:00:00 AM
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి
హనుమకొండ అక్టోబర్ 12 ( విజయ క్రాంతి): ఐదు సంవత్సరాలలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించడం ప్రతి ఒక్కరు బాధ్యత అని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా హనుమకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి , హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ లతో కలిసి పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ఐదు సంవత్సరంలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించడం ప్రతి ఒక్క పౌరుని బాధ్యత అని, భవిష్యత్తులో వారికి ఎలాంటి ఆరోగ్యపరమైన సమస్యలు రాకుండా పోలియో వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే కార్యక్రమం నిర్వహించిన ప్రతిసారి పోలియో చుక్కలు వేయించాలన్నారు.
వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలకు పోలియో చుక్కలు తప్పకుండా వేయించాలన్నారు. ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ జిల్లాలో ఐదు సంవత్సరాల వయసున్న పిల్లలు సుమారు 85,000 మంది ఉన్నారని, వీరందరికీ పోలియో చుక్కలు వేసేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఆరోగ్యఉప కేంద్రాలు అంగన్వాడీ కేంద్రాలు, ,పాఠశాలల్లో 472 పోలియో చుక్కల కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.
ఈరోజు వేయించుకోని పిల్లల కోసం రేపటినుండి రెండు రోజులు ఇంటింటికి తిరిగి పోలియో చుక్కలు వేయడం జరుగుతుందని, ఆరోగ్య సిబ్బందితోపాటు అంగన్వాడీ కార్యకర్తలు, మెప్మా మహిళా సమాఖ్య, నర్సింగ్ విద్యార్థులు, మున్సిపల్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలోని వార్డులను సందర్శించి బాలింతలతో మాట్లాడి వారి ఆరోగ్య స్థితిని, అలాగే అక్కడ తల్లికి బిడ్డకు అందుతున్న వైద్య సేవలను గురించి కలెక్టర్ అడిగి తెలుసుకు న్నారు.
రాష్ట్ర పరిశీలకులు శ్రీనివాసరావు , డాక్టర్ ప్రసాద్, అశోక్ లు పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో పలు పల్స్ పోలియో కేంద్రాలను సందర్శించి కార్యక్రమ అమలు తీరును పరిశీలించారు. హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎ. అప్పయ్య, రెడ్ క్రాస్ పాలకమండలి సభ్యులు ఇ. వి. శ్రీనివాసరావు, ఆసుపత్రి సూపరింటెండెం ట్ డాక్టర్ విజయలక్ష్మి, జిల్లా సంక్షేమ అధికారి జయంతి, అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ టి.మదన్ మోహన్ రావు, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ మహేందర్, జిల్లా టీవీ నియంత్రణ అధికారి డాక్టర్ హిమబిందు, ట్రై సిటిస్ అపార్ట్మెంట్స్ అసోసియే షన్ అధ్యక్షులు రెంటాల కేశవరెడ్డి, జిల్లా మాస్ మీడియా అధికారి వి అశోక్రెడ్డి, వై ద్యాధికారి డాక్టర్ గీత, సిబ్బంది పాల్గొన్నారు.
1810 చిన్నారులకు పోలియో మందు పంపిణీ
భీమదేవరపల్లి, అక్టోబర్ 12 (విజయక్రాంతి): ఈరోజు ముల్కనూర్ ప్రాథమిక ఆరోగ్యకేంద్ర పరిధిలో సబ్ నేషన్ ఇమ్యూనైజేషన్డేలో భాగంగా21 పోలియో కేంద్రాలలో 1810 మంది అయిదు సంవత్సరాల లోపు చిన్నారులకుపోలియో చుక్కల మందు వేయడం జరిగిందని ముల్కనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ప్రదీప్ రెడ్డి తెలిపారు.13,14తేదీలలోఇంటింటికి తిరిగి, పోలియో చుక్కల మందు వారికివేయడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో వైద్యాధికారి ప్రదీప్ రెడ్డి డాక్టర్ నివేదిత, సిబ్బంది మల్లీశ్వరి , జ్యోతి, రాజయ్య , రత్నభారతి ,రాజు , మహేందర్, అనిత కుమారి, కళ, గీత , వనజ, సత్యవేద, స్వరూప, అంగన్వాడి సిబ్బంది,ఆశ కార్యకర్తలుమరియు స్వచ్ఛంద కార్యకర్తలు పాల్గొ న్నారు. హనుమకొండ జిల్లా ఉప వైద్యాధికారి విజయ్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు.