20-06-2025 12:45:50 AM
జూలై 4న సీట్ల కేటాయింపు
హైదరాబాద్, జూన్ 19 (విజయక్రాంతి): ఈ నెల 24 నుంచి పాలిసెట్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. ఈ మేరకు షెడ్యూల్ను అధికారులు గురువారం విడుదల చేశారు. ఈ నెల 28 వరకు దరఖాస్తు, స్లాట్ బుకింగ్, సర్టిఫికెట్ వెరిఫికేషన్కు అవకాశం కల్పించారు. ఆప్షన్ ఇచ్చుకునేందుకు ఈ నెల 26 నుంచి జూలై 1 వరకు అవకాశం ఉంది.
జూలై 4న సీట్లను కేటాయిస్తారు. జూలై 4 నుంచి 7 వరకు సీటు పొందిన విద్యార్థులు ఫీజు చెల్లించి కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలని సూచించారు. ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ జూలై 9 నుంచి ప్రారంభమై అదే నెల 15న సీట్లను కేటాయిస్తారు. తరగతులు జూలై 18 నుంచి ప్రారంభం కానున్నాయి.