13 July, 2026 | 5:13 PM

Breaking News

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో బెల్లంపల్లి క్రీడాకారులకు పతకాలు   •   బంజారా కమ్యూనిటీ హాల్‌కు స్థలం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి   •   విద్యార్థుల ఆరోగ్యానికి భద్రత   •   ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేయాలి – జిల్లా కలెక్టర్ కె. హరిత   •   ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ద్వారా నులిపురుగులను నివారించవచ్చు   •   విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ కె.హరిత   •   కాంగ్రెస్ పార్టీలో 'జక్కిడి' మంటలు   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల మంజూరు పత్రలు అందజేత   •   ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ   •  

చెరువులో పాలిటెక్నిక్ విద్యార్థి గల్లంతు

07-12-2025 12:00 AM

-స్నానానికి వెళ్లి మునిగిపోవడంతో ఘటన

-అచూకీ కోసం గాలిస్తున్న ఎస్‌డీఆర్‌ఎఫ్, పోలీసు బృందాలు

మహబూబాబాద్, డిసెంబర్ 6 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా అనంతద్రి జగన్నాథ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లి మైసమ్మ చెరువులో స్నానం చేయడానికి దిగిన పాలిటెక్నిక్ విద్యార్థి భూక్యా సాయి కిరణ్ గల్లంతయ్యా. మహబూబాబాద్ మం డలం రెగ్యాల గ్రామానికి చెందిన సాయికిర ణ్ కేసముద్రం పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా చదువుతున్నాడు. ఎనిమిది మంది సహచరులతో వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి మై సమ్మ చెరువులో స్నానమాచరించినందుకు దిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సాయికిరణ్ చెరువులో మునిగిపోగా మిగిలిన వారు ప్రాణాలతో బయటపడ్డారు. సాయికిరణ్ ఆచూకీ కోసం ఎస్‌డీఆర్‌ఎఫ్, పోలీసు బృందాలు చెరువులో గాలింపు చేపట్టాయి.