17 April, 2026 | 3:16 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు

28-10-2025 07:13 PM

సీతంపేట శివాలయంలో ప్రత్యేక పూజలు..

60 కేజీల భారీ కేక్ కట్ చేసిన కాంగ్రెస్ శ్రేణులు..

పినపాక (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. మంగళవారం ఏడూళ్ళ బయ్యారం క్రాస్ రోడ్ లోని పార్టీ కార్యాలయంలో జరిగిన జన్మదిన వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ అభిమానులు నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున హాజరయ్యారు. క్రాస్ రోడ్డు నుంచి సీతంపేట శివాలయానికి భారీ బైక్ ర్యాలీగా వెళ్లి ప్రత్యేక పూజలు చేయించారు. ఈ సందర్బంగా 60 కేజీల భారీ కేక్ కట్ చేసి స్వీట్స్ పంచారు. ఉమ్మడి జిల్లా అభివృద్ధి ప్రధాత పొంగులేటి శ్రీను అన్న నాయకత్వంలో ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని శక్తిగా ఉంటుందని, ఆయన అడుగుజాడల్లో నడుస్తామన్నారు.

కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గంగిరెడ్డి వెంకటరెడ్డి, ఉడుముల రవీందర్ రెడ్డి, పేరం వెంకటేశ్వర్లు, కొర్స బాలకృష్ణ,  శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీటీసీ పోలిశెట్టి హరీష్, యూత్ కాంగ్రెస్ పెనుపాక మండల అధ్యక్షులు సింహాద్రి మనోజ్ మాజీ సర్పంచులు తోలెం కళ్యాణి, కొర్సా కృష్ణంరాజు,  వాగబోయిన చందర్ రావు, వంకా నర్సింహారావు, నాయకులు పొనుగోటి చందర్ రావు, సాగి సురేష్,  కొమరం రాములు, సుంకర వెంకటరమణ, కస్తూరి లింగయ్య, మద్దెల సమ్మయ్య, బోడ రమేష్, సాగర్ రెడ్డి, ఆరె నవీన్, కోడెం రామ్ మోహన్, మధు, మల్లయ్య, హేమంత్, సాగి సురేష్, కొప్పుల వీరాస్వామి, సతీష్ చారీ, తాల్లూరి కాంతయ్య, వీరబాబు, కే బుచ్చి బాబు, మునిగల శేఖర్, గుట్టయ్య, తాటి సుజాత, విజయ, జంపయ్య, కళ్యాణం నాగేశ్వరరావు, గంజాయి చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు.