14-06-2025 07:02:27 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో నూతనంగా ఏర్పడ్డ కేసముద్రం మున్సిపాలిటీ అభివృద్ధికి 100 కోట్ల రూపాయలను కేటాయించడాన్ని ఆశిస్తూ కేసముద్రం బల్దియా పరిధిలో అమీనాపురంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అంబటి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ... నూతనంగా కేసముద్రం మునిసిపాలిటీని ఏర్పాటు చేయడమే కాకుండా మున్సిపాలిటీ పరిధిలోని గ్రామాలలో అంతర్గత రోడ్లు, డ్రైనేజీలు, వివిధ అభివృద్ధి పనుల కోసం 100 కోట్ల రూపాయలను ప్రభుత్వం ప్రత్యేకంగా మంజూరు చేసినందుకు, అభివృద్ధి ప్రధాతలు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
అదేవిధంగా గతంలో ప్రభుత్వ ఇంటిగ్రేటెడ్ పాలిటెక్నిక్ కాలేజీ, ప్రభుత్వ డిగ్రీ కాలేజీని, అగ్నిమాపక కేంద్రం, బైపాస్ రోడ్డు విస్తరణ, అంబేద్కర్ నుండి కోరుకొండ పల్లి క్రాస్ వరకు ఆర్ అండ్ బి రోడ్డు విస్తరణ సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు, 50 పడకల ఆసుపత్రిని మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అదే విధంగా శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళి నాయక్, పార్లమెంట్ సభ్యులు కోరిక బలరాం నాయక్ మహబూబాబాద్ నియోజకవర్గానికి అదనంగా 1000 ఇండ్లుమంజూరు చేయాలని ముఖ్యమంత్రిని కోరగానే వెంటనే మంజూరు చేయడం జరిగిందన్నారు. కేసముద్రం పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపించే విధంగా కృషి చేస్తున్న అభివృద్ధి ప్రదాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళ్లెం శ్రీనివాస్ రెడ్డి, జన్ను కట్టయ్య, సామ సుధాకర్ రెడ్డి, మందుల కృష్ణమూర్తి, వేల్పుగొండ ఏలియా, కుడారి నాగేంద్రబాబు, లాకావత్ బాలు నాయక్, భోగం రమాదేవి, కుక్క ముడి యాకయ్య పాల్గొన్నారు