13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

పదవిని దైవంగా భావించాలి

20-01-2026 02:01 AM

సిద్దిపేట, జనవరి 19 (విజయక్రాంతి): ఉద్యోగమైన, రాజకీయ పదవి అయిన దై వంతో భావిస్తేనే దానికి సంపూర్ణమైన న్యా యం చేయగలుగుతామని సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి సూచించారు. సోమవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో సర్పంచు లకు ఏర్పాటు చేసిన శిక్షణ తరగతులను ప్రా రంభించి మాట్లాడారు. ప్రజలకు అవసరమైన కనీస మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. మీకు దక్కిన పదవికి న్యాయం చేయాలని చెప్పారు.

సర్పంచుల విధులు, బాధ్యతలు, నిధులు, ఆ దాయం, ఖర్చు వంటి అంశాలను శిక్షణలో నేర్చుకుంటారని, ఏది చేసిన వార్డు సభ్యులను కలుపుకొని చట్టం పరిధిలో చేయాలని ఆదేశించారు. శిక్షణ తరగతులలో ఏర్పాటుచేసిన వివిధ శాఖల స్టాల్స్ ను పరిశీలించి వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి రవీందర్, డిఆర్డిఏ పిడి జయదేవ్ ఆర్య, వివిధ శాఖల అధికారులు, మాస్టర్ ట్రైనర్స్, సర్పంచులు పాల్గొన్నారు.