11-06-2025 04:39:51 PM
కాంగ్రెస్ పార్టీ జిల్లా కోఆర్డినేటర్ ధనవంతి..
వలిగొండ (విజయక్రాంతి): పార్టీ కోసం కష్టపడిన వారికే పార్టీ పదవులు ఇవ్వడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా కోఆర్డినేటర్ ధనవంతి(District Coordinator Dhanvanthi) అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని సాయిగణేష్ ఫంక్షన్ హాల్ లో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు పదవి కోసం దరఖాస్తుల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నర పరిపాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు అందించిందని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్న బియ్యం పథకం, ఇందిరమ్మ ఇండ్లు అందించడం జరిగిందని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆడెం సంజీవరెడ్డి, కాంగ్రెస్ మండల, పట్టణ అధ్యక్షులు పాశం సత్తిరెడ్డి, కంకల కిష్టయ్య, తుమ్మల యుగంధర్ రెడ్డి, బత్తిని సహదేవ్, పబ్బు ఉపేందర్ బోస్, చెరుకు శివయ్య, బెలిదే నాగేశ్వర్, ఉలిపే మల్లేశం, ఐటిపాముల రవీంద్ర, కొండూరు భాస్కర్, జక్క జంగారెడ్డి, మామిడి నరేందర్ రెడ్డి, వంగాల అశోక్, కొండూరు సాయి, బద్దం సంజీవరెడ్డి, పల్సం సతీష్, గంగాపురం దైవదినం, ఉదయగిరి భాస్కర్, రేఖల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.