11-06-2025 04:36:38 PM
ముత్తారం తహసిల్దార్ మధుసుధన్ రెడ్డి..
ముత్తారం (విజయక్రాంతి): భూ భారతితో భూ సమస్యలు పరిష్కారం అవుతాయని ముత్తారం తాహసీల్దార్ మధుసూదన్ రెడ్డి(Tahsildar Madhusudhan Reddy) అన్నారు. బుధవారం మండలంలోని పారుపల్లిలో భూ భారతి రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భూ భారతితో భూ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి 2025 ఆర్ఓఆర్ చట్టం రైతులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని, గ్రామాల్లో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులో రైతులు తమ సమస్యలను రాతపూర్వకంగా అధికారులకు ఫిర్యాదు చేయాలని తాహసీల్దార్ రైతులను కోరారు. రెవెన్యూ సదస్సులో రైతుల నుంచి స్వీకరించిన దరఖాస్తులు, ఫిర్యాదులను పరిష్కరించడానికి క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపిస్తామని తెలిపారు. ఈ రెవెన్యూ సదస్సులో ఖమ్మంపల్లిలో డిటి తో పాటు ఆర్ ఐ రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.