11-06-2025 05:00:37 PM
జిల్లా రోడ్డు రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి..
కామారెడ్డి (విజయక్రాంతి): జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా బుధవారం కామారెడ్డి జిల్లా స్థానిక లిటిల్ స్కాలర్ పాఠశాలలో స్కూల్ బస్సు డ్రైవర్లు, యాజమాన్యలకు జిల్లా రోడ్డు రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి(District Road Transport Department Officer Srinivas Reddy) అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యముగా స్కూల్ బస్సుల నియమ నిబంధనలు పాటిస్తూ, స్కూల్ విద్యార్థుల యోగక్షేమాలను దృష్టిలో ఉంచుకొని డ్రైవింగ్ చేయాలని వారు సూచించారు. స్కూల్ బస్సులు ఫిట్నెస్ సర్టిఫికెట్స్ లేకుండా నడుపుతుంటే విద్యా సంస్థల గుర్తింపు రద్దు చేస్తామన్నారు. డ్రైవర్లు సీట్ బెల్ట్ దరించాలని తెలిపారు.
ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. అత్యధిక ప్రమాదాలు, మరణాలు,హెల్మెట్ ధరించక పోవడం వల్లే జరుగుతున్నాయని అన్నారు. మద్యం తాగి స్కూల్ బస్సులు నడిపించ కుడదన్నారు. అతివేగం ప్రమాదాలకు కారణం అవుతుందన్నారు. వాహనం నడుపుతూ సెల్ ఫోన్లో మాట్లాడవద్దని సూచించారు. తెలంగాణ రవాణా శాఖ కమిషనర్ సూచించిన విధంగా విద్యా సంస్థల బస్సుల యాజమాన్యాలు నిబంధనలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ బస్సుల డ్రైవర్లు, బస్సుల యాజమానులు, లిటిల్ స్కాలర్ పాఠశాల ప్రిన్సిపాల్ పున్నరాజేష్, పాఠశాల ల బస్సు డ్రైవర్లు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.