18 August, 2026 | 4:50 PM

Breaking News

భిన్న దృక్కోణాల ద్వారా మానసిక సవాళ్లను పరిష్కరించాలి   •   బెస్ట్ ఎంప్లాయి అవార్డు గ్రహీతకు సన్మానం   •   ఆత్మ ఆధ్వర్యంలో రైతులకు శిక్షణ   •   ఎమ్మార్వో పి.విట్టల్, సీఐ వెంకట్ నారాయణకు ఘన సన్మానం   •   భూస్వాముల అన్యాయానికి ఎదురునిలిచిన విప్లవ వీరుడు   •   సిర్గాపూర్‌లో షీటీం ఆధ్వర్యంలో పోలీస్ అవగాహన కార్యక్రమం   •   ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ, జిల్లా అధ్యక్షుల ఎన్నికలపై ఎగ్జిక్యూటివ్ సమావేశం   •   ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు   •   సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ఘన నివాళులు   •   లగ్డారం రైతుల తరఫున హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు   •  

శభాష్... పిల్లలు

02-09-2024 04:57 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి మండలంలోని బుగ్గ రాజరాజేశ్వర దేవస్థానానికి వెళ్లే రహదారిపై సోమవారం కురిసిన వర్షం ధాటికి గుంత పడి ప్రమాదకరంగా మారింది. ఈ విషయాన్ని గమనించిన కన్నాల గ్రామానికి చెందిన కొంతమంది పిల్లలు రోడ్డుపై గుంత పడిన ప్రాంతానికి వెళ్లి రోడ్డు మీద వెళ్లే వాహనదారులను అప్రమత్తం చేస్తూ కనిపించారు. రోడ్డుపై గుంత పడింది.. పక్కనుండి వెళ్ళండి.. అంటూ చిన్నారులు ఆదిత్య, సుశాంత్, అజయ్, శ్రీకర్, మణి , ఆదిత్య లు వచ్చి పోయే భక్తులను అప్రమత్తం చేస్తూ గంటసేపు వర్షంలో అక్కడే ఉన్నారు. చిన్నతనంలోనే సామాజిక బాధ్యతతో ప్రమాదం జరగకుండా ప్రయాణికులకు జాగ్రత్తలు చెప్పిన ఈ చిన్నారులను చూసి ప్రతి ఒక్కరు శభాష్ అంటూ అభినందించారు.