calender_icon.png 19 June, 2025 | 6:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరోసారి సిట్ విచారణకు హాజరైన ప్రభాకర్ రావు

19-06-2025 12:15:41 PM

హైదరాబాద్: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case) సిట్ అధికారులు దూకుడు పెంచారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు(Former SIB OSD Prabhakar Rao) ఈనెల 9,11,14 తేదీల్లో సిట్ విచారణకు వచ్చిన ఆయన గురువారం మరోసారి హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు సాక్ష్యలు ఇచ్చిన వారి వాంగ్మూలాల ఆధారంగా నిన్న 8 గంగల పాటు ప్రణీత్ రావును సిట్ ప్రశ్నించింది. ఇవాళ ప్రభాకర్‌రావు, ప్రణీత్‌రావును కలిపి విచారించనున్న సిట్‌ ముందు ఉదయం 11 గంటలకు హాజరయ్యారు. ఇప్పటికే 600 మంది ఫోన్ ట్యాపింగ్ బాధితుల జాబితాను అధికారులు సిద్ధం చేశారు.