calender_icon.png 19 June, 2025 | 6:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హైదరాబాద్-తిరుపతి విమానంలో సాంకేతిక సమస్యలు

19-06-2025 12:00:09 PM

హైదరాబాద్: హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న స్పైస్ జెల్ ఎస్జీ 2696 విమానంలో సాంకేతిక సమస్య ఏర్పాడింది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉదయం 6.10 గంటలకు బయలుదేరాల్సిన SG 2696 విమానం, ఉదయం 6.19 గంటలకు బయలుదేరి 7.40 గంటలకు తిరుపతిలో ల్యాండ్ కావాల్సి ఉంది. టేకాఫ్ అయిన 10 నిమిషాలకే విమానంలో సాంకేతిక సమస్య రావడంతో వెనక్కి మళ్లించారు.

స్పైస్ జెట్ విమానంలో మొత్తం 80 మంది ప్రయాణికులు ఉన్నారు. 80 మంది ప్రయాణికులతో కూడిన ఆ విమానం సురక్షితంగా తిరిగి శంషాబాద్ విమానాశ్రయానికి రావడంతో ప్రయాణికులు ఉపిరి పల్చుకున్నారు. 80 మందిని వేర్వేరు విమానాల్లో తిరుపతికి పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తన కార్యకలాపాల భద్రతను నిర్ధారించడానికి ఎయిర్‌లైన్ ప్రస్తుతం పరిస్థితిని అంచనా వేస్తోంది.