17-06-2025 11:26:50 AM
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్(Phone Tapping Case) కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్(Former SIB chief Prabhakar) రావు నేడు మరోసారి సిట్(Special Investigation Team) విచారణకు హాజరుకానున్నారు. ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు నాలుగోసారి విచారణకు హాజరుఅవుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(PCC Chief Mahesh Kumar Goud) కాసేపట్లో మొదటి సాక్షిగా వాంగ్మూలం ఇవ్వనున్నారు. జూబ్లీహిల్స్ ఏసీపీ వద్ద మహేశ్ కుమార్ గౌడ్ వాంగ్మూలం ఇవ్వనున్నారు. అసెంబ్లీ ఎన్నికల వేళ మహేశ్ కుమార్ గౌడ్ ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు ఆరోపణలున్నాయి. 2023లో మహేష్ కుమార్ ఫోన్ను ప్రణీత్ రావు(Praneeth Rao) టీమ్ ట్యాపింగ్ చేసింది. గద్వాల మాజీ జడ్పీ ఛైర్పర్సన్ సరిత నేడు సిట్కు వాంగ్మూలం ఇవ్వనుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సరిత పోటీ చేశారు. ప్రణీత్ రావు ఫోన్ డేటాలో 400 ఫోన్ నంబర్లు బయటపడ్డాయి. నేడు ప్రభాకర్ రావును, రేపు ప్రణీత్ రావును సిట్ అధికారులు విచారించనున్నారు. ఇప్పటికే 600 మంది ఫోన్ ట్యాపింగ్ బాధితుల జాబితా సిద్ధం చేశారు. వాంగ్మూలం ఇవ్వాలని ఫోన్ ట్యాపింగ్ బాధితులకు పోలీసులు సూచించారు.