28 February, 2026 | 11:32 AM

వయనాడ్‌ బాధితుల కోసం ప్రభాస్ రూ. 2 కోట్లు విరాళం

07-08-2024 10:47 AM

పాన్-ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ తన దయ హృదయాన్ని మరోసారి చాటుకున్నాడు. దేశంలో విపత్తు సంభవించినప్పుడు, బాధితులకు డబ్బును విరాళంగా అందించే వారిలో ప్రభాస్ ఎప్పుడూ ఉంటాడు. ప్రస్తుతం వాయనాడ్‌లో సహాయక చర్యలకు తన మద్దతును ప్రకటించాడు ప్రభాస్. కొండచరియలు విరిగిపడిన వాయనాడ్‌ పునరుద్ధరణ కోసం కేరళ ముఖ్యమంత్రి సహాయనిధికి 2 కోట్ల రూపాయలను అందించాడు. వాయనాడ్ ప్రాంతంలో వరదల కారణంగా కొండచరియలు విరిగిపడి వందలాది మంది మరణించారు. ఇళ్లు, ఇతర ఆస్తులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, రష్మికతో సహా తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు సహాయ కార్యక్రమాలకు తమ సహకారాన్ని ప్రకటించారు. ఇప్పుడు ప్రభాస్ భారీ మొత్తాన్ని ప్రకటించాడు.