స్పీకర్ విచారణకు హాజరైన ఎమ్మెల్యే కడియం శ్రీహరి
హైదరాబాద్: తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Telangana Speaker) తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారిస్తున్నారు. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Station Ghanpur MLA Kadiyam Srihari) స్పీకర్ విచారణకు హాజరయ్యారు. కడియంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద వేసిన అనర్హత పిటిషన్ స్పీకర్ నేడు విచారణ జరుపుతున్నారు. కడియం శ్రీహరి తరుపు సాక్షాలను స్పీకర్ నమోదు చేయనున్నారు.
ఎమ్మెల్యే కేపీ వివేకానంద(MLA KP Vivekananda) అడ్వొకేట్లు కడియం శ్రీహరిని క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు. అటు ఖైరతాబాద్ బీఆర్ఎస్ టర్న్కోట్ ఎమ్మెల్యే దానం నాగేందర్ శుక్రవారం స్పీకర్ ప్రసాద్ కుమార్ విచారణకు గైర్హాజరయ్యారు. ఎమ్మెల్యే తరపున ఆయన న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ కు హాజరయ్యారు. పిటిషనర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి న్యాయవాదులు దానం నాగేందర్ న్యాయవాదుల నుండి కొంత సమాచారం కోరినట్లు తెలిసింది.




