21-12-2025 05:09:57 PM
రాజన్నసిరిసిల్ల,(విజయక్రాంతి): జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో రేపు సోమవారం ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఒక ప్రకటనలో తెలిపారు. రెండో సాధారణ పంచాయతీ ఎన్నికలు- 2025 లో గెలుపొందిన సర్పంచ్, వార్డు సభ్యులు ఈ నెల 22వ తేదీన (సోమవారం) ప్రమాణ స్వీకారం చేయనున్నందున అధికార యంత్రాంగం ఆయా పనులలో నిమగ్నమై ఉంటారని పేర్కొన్నారు. ఈ కారణంగా ప్రజావాణి కార్యక్రమం రద్దు చేయడం జరిగిందని తెలిపారు.