8 June, 2026 | 11:13 PM

ప్రసాద్ ఆశయాలను కొనసాగించాలి

08-06-2026 10:05 PM

ములకలపల్లి,(విజయక్రాంతి): అశ్వారావుపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి ప్రసాద్ కృషి చేశారని పార్టీ కోసం చేసిన సేవలను గుర్తు చేసుకుని ఆయన ఆశయాలను సాధించడమే ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి అని అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నాయకులు తాటి వెంకటేశ్వర్లు అన్నారు.తెలంగాణ ఉద్యమకారుడు, బీఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు పాలకుర్తి ప్రసాద్ ద్వితీయ వర్ధంతిని ములకలపల్లి మండలంలోని పొగళ్ళపల్లి గ్రామంలో సోమవారం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో బూర్గంపహాడ్,అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర మాజీ తొలి ట్రైకార్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ తాటి వెంకటేశ్వర్లు పాల్గొని ప్రసాద్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలకుర్తి ప్రసాద్ సేవలను, తెలంగాణ ఉద్యమంలో ఆయన చేసిన కృషిని గుర్తు చేశారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేసి, ధైర్యంగా ఉండాలని ఓదార్చారు.