calender_icon.png 29 June, 2025 | 5:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నియోజకవర్గంలో మంత్రి అభివృద్ధి ఎంత..?

27-05-2025 04:54:21 PM

ఉనికి కోసమే యువజన నాయకుల ఆరాటం..

హుజురాబాద్ (విజయక్రాంతి): నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ మంత్రి చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని బీజేవైఎం జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు ప్రశాంత్ డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా(Karimnagar District) హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట పట్టణంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు ప్రశాంత్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ యువజన నాయకులు ఉనికి కోసమే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Union Minister Bandi Sanjay) ఫ్లెక్సీకి వినతి పత్రాలు ఇస్తున్నారన్నారు.

జమ్మికుంట రైల్వే స్టేషన్ ఆధునికరణకు సంబంధించిన ప్రతిపాదన రైల్వే మంత్రి పంపినట్లు స్వయంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారన్నారు. కరీంనగర్ నేషనల్ హైవే రోడ్డు, ఇల్లంతకుంట సీతారామచంద్రస్వామి ఆలయాన్ని ప్రసాద స్కీమ్లో భాగంగా అభివృద్ధి చేసే బాధ్యత పూర్తిగా కేంద్రమంత్రి బండి సంజయ్ తీసుకున్నారన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రతి గ్రామపంచాయతీకి సిసి రోడ్, డ్రైనేజ్, సానిటేషన్కు నిధులు కేంద్ర ప్రభుత్వమే ఇస్తుందని యువజన సంఘం నాయకులకు తెలియదా అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 18 సంవత్సరాలు గడిచినప్పటికీ హుజురాబాద్ నియోజకవర్గంలో తట్టేడు మట్టి కూడా పోయలేదు అన్నారు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయినా జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ ఏం అభివృద్ధి చేశారో తెలపాలని అన్నారు. యువజన సంఘం నాయకులు చర్చలకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో అఖిల్, శివ, నాగరాజు, ప్రవీణ్, విజయ్, గణేష్, శ్రీనివాస్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.