27-05-2025 05:02:42 PM
బీజేపీ నాయకులు రఘురాం గౌడ్..
హన్వాడ: కొత్తపేట, ఎనేమిది తండా గ్రామలలో మహారాణి అహల్యా బాయి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బిజెపి నాయకులు రఘురాం గౌడ్(BJP leader Raghuram Goud) హాజరై మాట్లాడుతూ... మహారాణి అహల్యా బాయి హోల్కర్(1725 మే 31-1795 ఆగస్టు 13), మరాఠాలు పరిపాలించిన మాల్వా సామ్రాజ్యపు హోల్కరు వంశ రాణి రాజమాత అహల్యాబాయి మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ ప్రాంతానికి చెందిన చొండి గ్రామంలో జన్మించారన్నారు. ఆమె తన పరిపాలన కాలంలో హిందూ మత కార్యకలాపాలు, ధార్మిక కార్యక్రమాలు నిర్వహించి పేరొందారు. మార్చి 24, 1754న వారి భర్త కుంభేరి యుద్ధంలో వీర మరణం తర్వాత సతీ సహగమానానికి సిద్దపడ్డారని తెలిపారు.
మామ మల్హర్ రావు వారించి సామ్రాజ్య బాధ్యతలు అప్పచెప్పారన్నారు. అహిల్యాబాయిహోల్కర్ ఆమె 11 డిసెంబర్ 1767 న రాణి అహిల్యాబాయి మాల్వా రాజ్యానికి సామ్రాజ్ని అయ్యారని వివరించారు. గోహాడ్ యుద్ధంలో విజయం సాధించిన రాణి అహిల్యాబాయి యొక్క వీరత్వాన్ని మాల్వా రాజ్యం మొత్తం గుర్తించింది. కాశీ విశ్వనాధ మందిరాన్ని రాణి అహిల్యాబాయి పునర్నిర్మించారాని రని పేర్కొన్నారు. మహారాణి అహల్యా బాయి తన పరిపాలనా కాలంలో ద్వారకా, రామేశ్వరం, బద్రినారాయణ్, సొంనాథ్, అయోధ్యా, మధురా, గయా, పూరీ జగన్నాధ్ వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో దేవాలయ మరమత్తులు చేయించి సత్రాలు నిర్మించారని, రాణీ అహిల్యాబాయి తన పరిపాలనా కాలంలో ఎన్నో నూతన విధానాలు ప్రవేశపెట్టారన్నారు.
తపాలా వ్యవస్థ అలాగే ఒక్క పైసాకే అడవిని దాటించే వ్యవస్థలను నిర్మించారన్నారు. రాణీ అహిల్యాబాయి అప్పట్లో కుటీర పరిశ్రమలు ఆర్ధికంగా నిలదొక్కుకోడానికి సంస్కరణలు తెచ్చారని తెలిపారు. నేటి రెడీమేడ్ దుస్తుల పరిశ్రమకు వారే మార్గదర్శ అన్నారు. ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షులు పుండు కూర రంగన్న, బూత్ అధ్యక్షుడు నారాముని శ్రీనివాసులు, పుండుకూర చెన్నప్ప, బోయిని రాములు, రాజు నాయక్, అంతారం ఆంజనేయులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.