02-02-2026 05:44:49 PM
సుల్తానాబాద్,(విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సోమవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ కు వచ్చిన బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, సుల్తానాబాద్ మున్సిపల్ ఇంచార్జ్ రాణి రుద్రమదేవికి బిజెపి నాయకులు మిట్టపల్లి ప్రవీణ్ కుమార్ బిజెపి కార్యాలయంలో శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు కర్రె సంజీవరెడ్డి, పలువురు ఉన్నారు.