సేవాలాల్ సేన నాయకుల ముందస్తు అరెస్ట్
29-04-2026 09:45 AM
మఠంపల్లి,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం 8 వేల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని నేడు సేవాలాల్ సేన రాష్ట్ర జాతీయ అధ్యక్షుడు భూక్య సంజీవ్ నాయక్ పిలుపుమేరకు సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షులు హుస్సేన్ నాయక్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది.మఠంపల్లి మండలం లాలితండా కు చెందిన సేవాలాల్ సేన తెలంగాణ రాష్ట్ర యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ భూక్యా బాలు నాయక్ ని బుధవారం ఉదయం అక్రమ ముందస్తు అరెస్టు చేయటం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అక్రమ అరెస్టులు ఉద్యమాన్ని ఆపలేవు విద్యార్థుల ఫీజు బకాయిలు ఇవ్వకపోతే చలో అసెంబ్లీ పిలుపునిస్తామని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.






