9 April, 2026 | 5:09 PM

Breaking News

దేశంలో భూపోరాటాలకు శ్రీకారం చుట్టిన మహోన్నత నేత సిఆర్   •   క్రమశిక్షణ ఉల్లంఘించిన అంగన్‌వాడీ టీచర్ స్వర్ణలత సస్పెండ్   •   ప్రవేట్ స్కూల్ బస్ డ్రైవర్ల సమస్యలు— పరిష్కరించాలని సీఐటీయూకి వినతిపత్రం   •   ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరలను పొందేలా చర్యలు   •   ఎన్పిడిసిల్ ద్వారా 33/11 కేవీ సబ్ స్టేషన్ మంజూరు   •   దోమకొండలో జెండర్ అవగాహన శిక్షణ కార్యక్రమం విజయవంతం   •   యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్   •   “మా కాలనీ మీదుగా లైన్ వద్దు” — సింగరేణి తీరుపై ప్రజలు ఆగ్రహం   •   ఢిల్లీ అసెంబ్లీకి బాంబు బెదిరింపు — వేర్వేరు సమయాల్లో పేలుళ్లు అంటూ హెచ్చరిక   •   ఓటు వేసిన అస్సాం సీఎం — ఎన్‌డీఏ గెలుపుపై ధీమా   •  

వైద్యం వికటించి గర్భిణి మృతి

16-02-2026 12:45 AM

డాక్టర్ నిర్లక్ష్యమని బంధువుల ఆరోపణ

ఆస్పత్రి ఎదుట ఆందోళన 

సిద్దిపేట క్రైం, ఫిబ్రవరి 15 : వైద్యం వికటించి గర్భిణీ మృతి చెందింది. వైద్యురాలి నిర్లక్ష్యమే మృతికి కారణమని ఆరోపిస్తూ బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. చిన్నకోడూరు మండలం చౌడారం గ్రామానికి చెందిన గాడిచర్ల అశ్విని, గణేష్ దంపతులు. గర్భవతి అయిన అశ్విని సిద్దిపేటలోని మానస ఉమెన్స్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ లో చికిత్స కోసం వచ్చారు. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్... గర్భస్థ శిశువు సరిగా పెరగడం లేదని, ఆపరేషన్ చేసి తొలగించాలని సూచించారు.

అబార్షన్ చేస్తున్న క్రమంలో అశ్వినికి తీవ్ర రక్తస్రావం అయింది. వెంటనే మరో ఆసుపత్రికి తరలించాలని వైద్యురాలు సూచించారు. అక్కడ చికిత్స పొందుతుండగా అశ్విని మృతి చెందారు. మానస ఆస్పత్రి వైద్యురాలు నిర్లక్ష్యం కారణంగానే అశ్విని మృతి చెందిందని బంధువుల ఆరోపించారు. మృతదేహంతో హాస్పిటల్ ఎదుట ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.