calender_icon.png 4 June, 2025 | 1:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్ర అభివృద్ధిలో పోలీస్ పాత్ర ఎనలేనిది

02-06-2025 09:07:12 AM

- జోగులాంబ నందు డీఐజీ ఎల్ఎస్. చౌహన్

మహబూబ్ నగర్, (విజయక్రాంతి): రాష్ట్ర అభివృద్ధిలో పోలీసుల పాత్ర ఈనలేనిదని జోగులాంబ నందు డీఐజీ ఎల్ఎస్. చౌహన్ అన్నారు. సోమవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం(Telangana Formation Day) సందర్భంగా డీఐజీ కార్యాలయంలో జాన్-7 జోగులాంబ నందు డీఐజీ శ ఎల్. ఎస్. చౌహన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో పోలీస్ శాఖ ఎంతో ఉందని తెలిపారు. ప్రతిక్షణం ప్రజల సంరక్షణ కోసమే పోలీస్ లు పనిచేస్తున్నారని పేర్కొన్నారు.  ప్రజల రక్షణ కోసం పోలీస్ సిబ్బంది కట్టుబాటుతో పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబ్‌నగర్ జిల్లా(Mahabubnagar District) ఎస్పీ  డి. జానకి, ఐ.పి.ఎస్., ఏ ఆర్ అదనపు ఎస్పీ సురేష్ కుమార్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, డి సి ఆర్ బి డీఎస్పీ రమణారెడ్డి, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, ఆర్‌ఐలు కృష్ణయ్య, రవి, నాగేశ్ , డీఐజీ కార్యాలయ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.