02-06-2025 09:07:12 AM
- జోగులాంబ నందు డీఐజీ ఎల్ఎస్. చౌహన్
మహబూబ్ నగర్, (విజయక్రాంతి): రాష్ట్ర అభివృద్ధిలో పోలీసుల పాత్ర ఈనలేనిదని జోగులాంబ నందు డీఐజీ ఎల్ఎస్. చౌహన్ అన్నారు. సోమవారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం(Telangana Formation Day) సందర్భంగా డీఐజీ కార్యాలయంలో జాన్-7 జోగులాంబ నందు డీఐజీ శ ఎల్. ఎస్. చౌహన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో పోలీస్ శాఖ ఎంతో ఉందని తెలిపారు. ప్రతిక్షణం ప్రజల సంరక్షణ కోసమే పోలీస్ లు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల రక్షణ కోసం పోలీస్ సిబ్బంది కట్టుబాటుతో పని చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మహబూబ్నగర్ జిల్లా(Mahabubnagar District) ఎస్పీ డి. జానకి, ఐ.పి.ఎస్., ఏ ఆర్ అదనపు ఎస్పీ సురేష్ కుమార్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, డి సి ఆర్ బి డీఎస్పీ రమణారెడ్డి, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసులు, ఆర్ఐలు కృష్ణయ్య, రవి, నాగేశ్ , డీఐజీ కార్యాలయ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.