08-05-2025 07:29:36 PM
న్యూఢిల్లీ: ఆపరేషన్ సింధూర్(Operation Sindoor)లో భాగంగా భారతదేశం తన ప్రతిస్పందనను కేంద్రీకృతం చేసిన, కొలవబడిన, తీవ్రతరం కాదని కల్నల్ సోఫియా ఖురేషి(Colonel Sofiya Qureshi) పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోఫియా మాట్లాడుతూ... పాకిస్తాన్ సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోలేదని ప్రత్యేకంగా ప్రస్తావించి, భారతదేశంలోని సైనిక లక్ష్యాలపై ఏదైనా దాడికి తగిన ప్రతిస్పందన ఉంటుందని పునరుద్ఘాటించారు. మే 07-08 రాత్రి కశ్మీన్ నుంచి గుజరాత్ వరకు సరిహద్దు ప్రాంతాల్లో దాడులకు ప్రయత్నించిన పాకిస్తాన్ ఉత్తర, పశ్చిమ భారతదేశంలోని అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్కోట్, అమృత్సర్, కపుర్తలా, జలంధర్, లూధియానా, ఆదంపూర్, భటిండా, చండీగఢ్, నల్, ఫలోడి, ఉత్తరంలోని భుజ్ వంటి అనేక సైనిక లక్ష్యాలను డ్రోన్లు, క్షిపణులను ఉపయోగించి దాడికి ప్రయత్నించిందని తెలిపారు.
వీటిని ఇంటిగ్రేటెడ్ కౌంటర్ యుఎఎస్ గ్రిడ్, వైమానిక రక్షణ వ్యవస్థలు నిర్వీర్యం చేశాయని, ఈ దాడులకు సంబంధిన శిథిలాలను ఇప్పుడు పాకిస్తాన్ దాడులకు రుజువు చేస్తాయని వెల్లడించారు. గురువారం ఉదయం భారత సాయుధ దళాలు పాకిస్తాన్లోని అనేక ప్రదేశాలలో వైమానిక రక్షణ రాడార్లు, వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్నట్లు వ్యాఖ్యానించారు. భారత ప్రతిస్పందన పాకిస్తాన్ మాదిరిగానే తీవ్రతతో ఉందని, భారత్ దాడుల్లో లాహోర్లోని వైమానిక రక్షణ వ్యవస్థను ధ్వంసమైనట్లు విశ్వసనీయంగా తెలిసిందని కల్నల్ సోఫియా ఖురేషి పేర్కొన్నారు. ఎల్ఓసీ వద్ద పాకిస్థాన్ కుప్పారా, బారాముల్లా, యురి, పుంఛ్, మెందార్, రాజౌరి, మోర్టార్లు, భారీ శతఘ్నులతో భారత్ పై నిరంతరాయంగా కాల్పులకు తెగబడుతుంది. పాక్ దాడుల్లో 16 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు.