ధరలు తగ్గించాలి.. రైతుల బకాయిలు చెల్లించాలి
12-09-2026 | 11:57am
తిరుమలాయపాలెం, సెప్టెంబర్ 12 (విజయ క్రాంతి): పెరుగుతున్న నిత్యావసర వస్తువులు, ఎరువులు, పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని సీపీఐ(ఎంఎల్) మాస్లైన్ అనుబంధ ఏఐయూకేఎస్ తెలంగాణ రాష్ట్ర నాయకులు కమ్మ కోమటి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. శుక్రవారం తెట్టెలపాడు క్రాస్రోడ్డులో ఖమ్మం–వరంగల్ జాతీయ రహదారిపై ధరల పెరుగుదలను నిరసిస్తూ 30 నిమిషాల రాస్తారో నిర్వహించారు.
మొక్కజొన్న రైతులకు పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని, సామాన్య ప్రజలపై పెరుగుతున్న భారాన్ని తగ్గించాలని ప్రభుత్వాలను కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించకపోతే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐపీకేఎంఎస్ జిల్లా కార్యదర్శి తిమ్మిడి హనుమంతరావు, పుసులూరి పుల్లయ్య, సోమనపల్లి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.