14 July, 2026 | 6:57 PM

Breaking News

విద్యార్థుల‌పై శ్ర‌ద్ద చూపండి   •   కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యం   •   కరాటేతోనే విద్యార్థినులకు ఆత్మరక్షణ   •   తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చే కుట్ర జరుగుతోంది   •   భద్రతా చర్యలపై బ్యాంక్ మేనేజర్లకు అవగాహన కల్పించిన సీఐ రంజిత్ రావు   •   మండలాధ్యక్షునిపై అసంతృప్తి రాగాలు   •   చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వినతి   •   విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్గి ఉండాలి   •   సింగరేణి హెడ్ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి: ఐఎఫ్టియు   •  

నామినేషన్ దాఖలు చేసిన ప్రియాంక గాంధీ

23-10-2024 02:36 PM

వాయనాడ్: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా బుధవారం వయనాడ్‌లో జరగనున్న లోక్‌సభ ఉపఎన్నికకు తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. దీంతో ఆమె ఎన్నికల అరంగేట్రం చేసింది. నవంబర్ 13న ఎన్నికలు జరగనుండగా.. ప్రియాంక గాంధీ మూడు సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఆమె పత్రాలపై సంతకం చేస్తున్నప్పుడు ఆమె భర్త రాబర్ట్ వాద్రా, వారి కుమారుడు కూడా ఉన్నారు. ఆమె తల్లి, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ ఆమె వెనుక కూర్చున్నారు. అభ్యర్థి వెంట ఐదుగురు మాత్రమే రావాలని అధికారులు పట్టుబట్టడంతో కొంత సేపటికి కాంగ్రెస్‌ అధ్యక్షుడు మలికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి, లోక్‌సభ సభ్యుడు కె.సి.వేణుగోపాల్ ప్రియాంక గాంధీ భర్త, వారి కుమారుడు ఛాంబర్‌ నుంచి బయటకు వచ్చారు. ప్రియాంక గాంధీ నామినేషన్‌ దాఖలు చేసే సమయంలో ఆమె సోదరుడు, ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ కూడా అక్కడే ఉన్నారు.