calender_icon.png 11 May, 2025 | 2:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లిడ్ క్యాప్ కు నిధులు కేటాయించి ఉత్పత్తులు ప్రారంభించాలి

09-05-2025 11:14:28 PM

మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షులు కొంగరి శంకర్ మాదిగ

మందమర్రి,(విజయక్రాంతి): పట్టణంలో 2007 సం,,లో ప్రారంభించిన లీడ్ క్యాప్ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం తన వంతు నిధులు కేటాయించి ఉత్పత్తులు ప్రారంభించాలని మాది హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షులు కొంగరి శంకర్ డిమాండ్ చేశారు. పట్టణంలోని పాలచెట్టు సమీపంలో ఏర్పాటుచేసిన లేడీ క్యాప్ భవనాన్ని భూములను శుక్రవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. లిడ్ క్యాప్ సాధనకు మాదిగ హక్కుల దండోరా సంపూర్ణ మద్దతు తెలుపుతుందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2007 సంవత్సరం లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చర్మకారుల అభివృద్ధి కోసం పట్టణంలో 25 ఎకరాలలో లిడ్ క్యాప్ కోసం  భూమిని  కేటా యించి నప్పటికీ  అది కేటా యింపు గానే మిగిలి పోయింది తప్ప ఉత్పత్తులు ప్రారంభించ కుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నందున ప్రారంభించేలా చర్యలు చేపట్టి పట్టణ ప్రజలకు ఉపాధి కల్పించాలని కోరారు.  అంటే కాకుండా కేంద్ర ప్రభుత్వం తన వాటా 80 శాతం నిధులను వెంటనే కేటాయించి నిధులు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించకపోవడం మూలంగా లీడ్ క్యాప్ భూములపై రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కబ్జాదారులు డేగ కన్ను వేసి సొంతం చేసుకోవాలని చూస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పేదలైన చర్మకారులు లబ్ధి పొందే విధంగా పరిసర ప్రాంత ప్రజలకు ఉపాధి అందే విధంగా ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలని, లేకుంటే లిడ్ క్యాప్ ఉత్పత్తులు ప్రారంభించే విధంగా ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు మాదిగ హక్కుల దండోరా ప్రజాస్వామ్య పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమం లో మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిలుక రాజనర్సు మాదిగ, లెదర్ ఇండస్ట్రీస్ పార్క్ సంఘ రాష్ట్ర అధ్యక్షులు పోత్తూరి రమేష్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోతే స్వామి, కొలుగురి విజయ్ కుమార్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పుల్లూరి లక్ష్మణ్, సంగి సంతోష్, డి కనకయ్య, నందిపేట రవి, బచ్చలి నరసయ్య, చిలుముల కుమార్, అసంపల్లి రాయమల్లు, సుద్దాల జనార్ధన్, మంతెన సుమన్, బత్తుల సరిత, బొడ్డు వినోద, తోకల నిరోష, కాంపల్లి లక్ష్మి, మామిడిపెళ్లి ప్రకాష్, శివ, వేల్పుల కిరణ్, కొలుగూరి పృథ్వీరాజ్ లు పాల్గొన్నారు.