21-06-2025 11:14:35 PM
కాల్వ శ్రీరాంపూర్ మాజీ జడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి
పెద్దపల్లి (విజయక్రాంతి): ప్రొఫెసర్ జయశంకర్ సార్ సేవలు చిరస్మరణీయమని కాల్వ శ్రీరాంపూర్ మాజీ జడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి అన్నారు. కాల్వశ్రీరాంపూర్ మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీరాంపూర్ మాజీ జడ్పీటీసీ మాట్లాడుతూ... తెలంగాణ ఏర్పాటులో జయశంకర్ పాత్ర మరులేమని జయశంకర్ తుదిశ్వాస విడిచే వరకు తెలంగాణ ఏర్పాటు కోసం కృషి చేశారని ఆయన ఆశయసాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. యువకులందరూ జయశంకర్ సార్ ను ఆదర్శంగా తీసుకోవాలని ఆయన అన్నారు.