calender_icon.png 14 June, 2025 | 6:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన ప్రాజెక్ట్ డైరెక్టర్ లోకి లాల్

14-06-2025 01:07:03 AM

మహాదేవపూర్,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం లోని ఎలికేశ్వరం గ్రామంలో శుక్రవారం ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ లోకిలాల్ పరిశీలించారు. లోకి లాల్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు 400 సీట్ల నుండి 600 ఫీట్ల వరకు నిర్మాణం చేపట్టాలని అన్నారు. భూమి ఇసిక స్వభావం ఉన్నట్లయితే కచ్చితంగా బేస్మెంట్ లెవెల్  వరకు పిల్లర్లు వేసుకోవాలని తెలుపుతూ లబ్ధిదారులకు పలు సూచనలు తెలియజేశారు. లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం లో 4 విడతలలో డబ్బులు జమవుతాయని మొదటగా బేస్మెంట్ లెవల్లో రూ.లక్ష లేంటల్ లెవెల్ లో రూ.లక్ష  స్లాబు లెవల్లో రూ.రెండు లక్షలు ప్లాస్టింగ్ రూ. లక్ష ప్రభుత్వం జమ చేయడం జరుగుతుందన్నారు.

ఇంటి నిర్మాణం ప్రతి దశలో ఫొటోస్ తీసుకొని ఎంబి రికార్డ్ చేయడం జరుగుతుందని లబ్ధిదారులు గమనించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో కొందరు మేస్త్రీలకు శిక్షణ ఇవ్వడం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం మేస్త్రీలకు ఒక రేటు ఖరారు చేసిందని ఒకవేళ ఎవరైనా మేస్త్రీలు ఎక్కువ డబ్బులు అడిగినచో అట్టి వారిపై ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్ చైతన్యకుమార్, డి ఈ, ఏఈ, గ్రామ కార్యదర్శి గాయత్రి, గ్రామస్తులు పాల్గొన్నారు.