14-06-2025 01:07:30 AM
హైదరాబాద్, జూన్ 13 (విజయ క్రాంతి): తెలంగాణ పురోగతిలో దేశ విదేశాలకు చెందిన వాణిజ్య సంస్థలు భాగ స్వాములు కావాలని ఐటీ, పరిశ్ర మలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పిలుపునిచ్చారు. అభివృద్ధి, సంక్షేమం లో తెలంగాణ దేశానికే రోల్మాడల్గా నిలుస్తోందని, రాష్ట్రం మున్ముందు కూడా ఇదే ఒరవడి కొనసాగిస్తుందని ఆకాంక్షించారు.
హైదరాబాద్లోని తాజ్ డెక్కన్ హోటల్లో శుక్రవారం ఇంటర్నే షనల్ బిజినెస్ కొలాబరేషన్ (ఐబీసీ) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘గ్లోబల్ లీడర్స్ సమ్మిట్-2025’లో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్ర జీడీపీ రూ.16.12 లక్షల కోట్లకు చేరిందని, 10.1 శాతం వృద్ధి రేటుతో దేశ సగటును దాటేసిందని స్పష్టం చేశారు. తెలంగాణ తలసరి ఆదాయం రూ.3.79 లక్షలు కాగా, ఇది దేశ సగటు కంటే 1.8 రేట్లు ఎక్కువని వెల్లడించారు.
ఏడాదిన్నర లోనే రాష్ట్రానికి రూ.3 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు తీసుకొచ్చామని వివరించారు. గడిచిన 14 నెలల్లో లైఫ్ సైన్సెస్లో రూ.40 వేల కోట్ల పెట్టుబడులను సాధించామని, 2 లక్షల ఉద్యోగాలు సృష్టించామని వెల్లడించారు. రాష్ట్ర జీడీపీలో సేవల రంగం వాటా 66.3 శాతం కాగా, ఇది దేశం లో ఇది 55 శాతమని స్పష్టం చేశారు. ఇవి అంకెల గారడీ కాదని, రాష్ట్ర పురోగతికి నిదర్శనాలని అభివర్ణించారు.
ఆగ్రో ఇన్నొవేషన్, ఏఐ గవర్నెన్స్, స్మార్ట్ సిస్టమ్స్, డిజిటల్ ఫా ర్మింగ్, ఫ్యూచర్-రెడీ ఎడ్యూకేషన్, సస్టునబుల్ మ్యానుఫ్యాక్చరింగ్, క్లీన్ ఎనర్జీ తదితర అంశాల్లో రాష్ట్రప్రభుత్వం ప్రపంచ దేశాలతో పని చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. మిగిలిన రాష్ట్రాలు అంతకుముందున్న ట్రెండ్ను అనుసరిస్తుంటే, తెలంగాణ ప్రభుత్వం మా త్రం ట్రెండ్ సృష్టిస్తున్నదన్నారు.
పారిశ్రామికవేత్తలు కేవలం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మాత్రమే రావొద్దని, రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామి అయ్యేందుకూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. సమ్మిట్ ద్వారా బ్రెజిల్, జర్మనీ, రష్యా, కామెరూన్, మాల్టా, యూకే, బల్గేరియా, బెల్జియం, యూఏఈ ఒకే వేదికపైకి రావడం హర్షణీయమని కొనియాడారు.
సమ్మిట్కు విచ్చేసిన ప్రతినిధు లంతా తెలంగాణలో పెట్టుబడులు పెడితే కలిగే ప్రయోజనాలను తమ దేశానికి చెంది న పారిశ్రామికవేత్తలకు వివరించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రప్రభుత్వం అనుసరిస్తున్న సరళీకృత విధానాలు, రాష్ట్రంలో నెలకొన్న అనుకూలతలను వివరించాలని సూచించారు.
సమ్మిట్ కేవలం ఒక సదస్సులా మిగిలిపోకుండా దేశాల మధ్య సంస్కృతీ సంప్రదా యాలు, వ్యూహాలు, సాంకేతికత బదిలీలకు వేదికగా మార్చాలని విజ్ఞప్తి చేశారు. సమ్మిట్లో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ డిప్లొమేటి క్ రిలేషన్స్ మాల్టా గవర్నర్ లిల్లో మర్రా, కార్యదర్శి మార్సెల్లో పట్టి, బెల్జియం ఎంపీ ఇవాన్ పెట్రోవ్, జర్మనీ డిప్లొమాట్ డానియల్ జెర్బిన్, అర్జెంటీనా ఎంపీ క్లాడియో సింగోలనీ, ఐబీసీ చైర్మన్ సాల్మన్ గట్టు, డైరెక్టర్ గ్లోరియా సుహాసిని పాల్గొన్నారు.