calender_icon.png 23 May, 2025 | 6:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదోన్నతులు పోలీసులకు బాధ్యతను పెంచుతాయి

23-05-2025 12:53:45 AM

ఎస్పీ రాజేష్ చంద్ర 

కామారెడ్డి, మే 22 (విజయక్రాంతి) : ఉద్యోగులకు పదోన్నతులు మరింత బాధ్యతను పెంచుతాయని జిల్లా ఎస్పీ ఆశిష్  సంగు వన్ తెలిపారు. గురువారం కామారెడ్డి ఎస్పీ కార్యాల యం లో ఏఎస్త్స్ర నుండి ఎస్త్స్రలుగా  పదోన్నతి పొందిన (11) పోలీసులను జిల్లా ఎస్పీ అభినం దించి పదోన్నతి చిహ్నాన్ని ఎస్పీ అలంకరించారు. 

పోలీసు వ్యవస్థలో నిరంతరంగా సేవలందించి గురువారం పదోన్నతి పొందుతున్న కామారెడ్డి జిల్లా రామారెడ్డి  పోలీస్టేషన్ ఏఎస్త్స్ర యన్. లచ్చీరామ్, ఎల్లారెడ్డి పోలీస్టేషన్ ఏఎస్త్స్ర, ఎండి,సిద్దికె,  భిక్నూర్ పోలీస్టేషన్ ఏఎస్త్స్ర, ఏ. మల్లారెడ్డి, పెద్దకొడపగల్ పోలీస్టేషన్ ఏఎస్త్స్ర, రాములు, మాచారెడ్డి  పోలీస్టేషన్ ఏఎస్త్స్ర, బి. నార్సింలు, గాంధారి  పోలీస్టేషన్ ఏఎస్త్స్ర, పి. గణేష్,  పిట్లం పోలీస్టేషన్ ఏఎస్త్స్ర, యల్. లింబద్రి , నాగిరెడ్డిపేట్ పోలీస్టేషన్ ఏఎస్త్స్ర, ఉమేష్,  దోమకొండ  పోలీస్టేషన్ ఏఎస్త్స్ర, సుబ్రమణ్య చారి, తాడ్వాయి పోలీస్టేషన్ ఏఎస్త్స్ర, సంజీవ్, హన్మగౌడ్ (ఇంటలిజెన్స్ లో ప్రస్తుతం) లు ఎస్త్స్రలుగా, పదోన్నతి పొందారు. 

పదోన్నతులు పొందిన పోలీస్ అధికారులు జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్రుడు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు. పదోన్నతి పొందిన పోలీసులకు  ఎస్పీ  పదోన్నతి చిహ్నాలను అలంకరించి శుభాకాంక్షలు తెలియజేసి  అభినందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసుశాఖలో పదోన్న త్తులు మరింత బాధ్యతను పెంచుతాయని అన్నారు,

పదోన్నతులు పొందిన పోలీస్ సిబ్బంది రెట్టింపు ఉత్సాహంతో ప్రజలకు సేవలు అందించాలని కోరారు.పోలీసు శాఖలో క్రమశిక్షణతో బాధ్యతగా విధుల పట్ల నిబద్ధతతో వ్యవహరించే ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు, గౌరవ మర్యాదలు  లభిస్తాయని తెలిపారు.  ఈ కార్యాక్రమంలో డిఎస్పీలు మదన్ లాల్ల్, యాకుబ్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ తిరుపతయ్య, రిజర్వు ఇన్స్ పెక్టర్లు సంతోష్ కుమార్,సిబ్బంది పాల్గొన్నారు.