17 April, 2026 | 10:29 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

కామారెడ్డి జిల్లాలో రెండో రోజూ భారీ వర్షం

23-05-2025 12:52 AM

కామారెడ్డి, మే 22 (విజయ క్రాంతి) ః కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న అకాల వర్షం రైతులను తీవ్ర నష్టాలకు గురిచేసింది. ఈ వర్షం పడడం వల్ల రైతులకు ఎటువంటి ఉపయోగం లేదు. వర్షాకాలం పంటలు వేసేందుకు దుక్కులు దున్ని విత్తనాలు వేసేందుకు సిద్ధంగా ఉంచిన రైతులకు ఈ అకాల వర్షం మరోసారి దుక్కులు దున్ని విత్తనాలు వేయాల్సి వస్తుందని రైతులు తెలిపారు.

బుధవారం తెల్లవారుజాము నుంచి కురిసిన వర్షమే కాకుండా గురువారం సైతం భారీ వర్షం కురిసింది. కామారెడ్డి ఎల్లారెడ్డి బాన్సువాడ జుక్కల్ నియోజక వర్గాల్లో ఈదురు గాలులతో కూడిన అకాల వర్షం రైతులను అపార నాష్టానికి గురి చేసినట్లు రైతులు వాపోతు న్నారు.

మామిడి పంట మరో 15 రోజులు,నెల లోపు పంట చేతికి వచ్చే సమయంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం వల్ల మామిడి చెట్ల నుంచి మామిడి కాయలు ఈదురు గాలులకు రాలి కింద పడిపోయాయి. మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారు.   పంట నష్టం వివరాలను వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదికలు తయారు చేస్తున్నారు. ఏఈవోలు వారికి ఇచ్చిన ట్యాబ్లో పంట నష్ట వివరాలను నిక్షిప్తం చేస్తున్నారు.

ఉన్నతాధికారులకు నివేదిస్తున్నట్లు తెలిపారు. అకాల వర్షం ఈదురు గాలులతో తీవ్రంగా నష్టపోయినట్లు రైతులు విజయ క్రాంతి ప్రతినిధితో తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రం నిర్వాహకులు రైస్ మిల్లర్లు రైతుల కష్టాన్ని నష్టాన్ని చూసి తడిసిన ధాన్యానికి కాంటా పెట్టి కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు.

కాలం కష్టపడి పండించిన పంట కు అమ్ముకు నే సమయంలో వాతావరణం సానుకూలంగా లేక అకాల వర్షం ఈదురు గాలులతో కూడిన వర్షం రైతులను వ్యాపాలను తీవ్రనాష్టానికి గురి చేసినట్లు వాపోతున్నారు.