06-06-2025 12:00:00 AM
ఎస్పీ పాటిల్ కాంతిలాల్ సుభాష్
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 5 ( విజ యక్రాంతి): ప్రజలకు పోలీసులు నిరంతరం అందుబాటులో ఉంటూ చట్ట పరిధిలో సమస్యలను పరిష్కారం చేస్తూ ప్రజల భద్ర త, రక్షణే ప్రధాన లక్ష్యమని జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన పాటిల్ కాంతిలాల్ సుభాష్ తెలిపారు.
హైదరాబాద్ సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీగా పనిచేసిన పాటిల్ కాంతిలా ల్ ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీగా బదిలీపై వచ్చా రు. 2020 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన కాం తిలాల్ 2018లో యూ.పి.ఎస్.సి సర్వీస్ ద్వార ఎంపికై భద్రాద్రి కొత్తగూడెం ఎఎస్పీ గా 2022లో పనిచేసి, 2023 జనవరి నుండి 2024 జులై వరకు నిర్మల్ జిల్లా భైంసా ఎఎస్పీ గా, 2024 జులై నుండి హైదరాబాద్ సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీగా విధులు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడు తూ జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు జిల్లా పోలీస్ శాఖ కట్టుబడి ఉంటుందని, పౌరుల రక్షణ పోలీసుల ప్రధాన లక్ష్యం అని అన్నారు. సామాన్యుడిని దృష్టిలో పెట్టికోని వారికి భరోసా కలిగించే విధంగా పోలీసింగ్ వుంటుందనీ, శాంతి భద్రతల విషయంలో ను కఠినంగా వుంటామని, ప్రభుత్వ నిషేధిత మత్తు పదార్థాలు, అసాంఘిక కార్యకలాపాలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.
ఎవరైన శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే సహించేది లేదని, సామాజిక మాద్యమాలను వేదికగా చేసుకోని వ్యక్తిగత, మతపర దూషణలకు పాల్పడితే చర్యలు తప్పవని, ఎవరైనా సామన్య ప్రజలను, ఎవరైన వ్యక్తిగతంగా చేసుకోని సామాజిక మాధ్యమాల ద్వారా చెడు ప్రచారం చేసిన, వ్యాక్యలు చేసిన వారిపై చర్యలు తప్పవని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా, విద్వేషాలను రెచ్చగోట్టేవారిని పట్ల కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు.