16 April, 2026 | 11:19 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

ఉగ్రదాడి నిరసిస్తూ నిరసన..

25-04-2025 04:33 PM

నిర్మల్ (విజయక్రాంతి): జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు మైనార్టీ నాయకులు జిల్లా గ్రంథాలయ చైర్మన్ అర్జున్ మత్ అలీ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని మసీదు వద్ద ఉగ్రదాడిని నిరసిస్తూ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతదేశంలో ఐక్యతను దెబ్బతీసేందుకు కొందరు ఉగ్రవాదులు ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారని అటువంటి వారిని ప్రభుత్వం పట్టుకొని కఠినంగా శిక్షించాలని గ్రంథాలయ చైర్మన్ తెలిపారు. దాడులు జరగకుండా కేంద్ర ప్రభుత్వం మరింత కఠినమైన చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.