17-06-2025 06:28:50 PM
ఖానాపూర్ (విజయక్రాంతి): కడెం మండలంలోని లింగాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో తమకు అన్యాయం జరిగిందని కొందరు మహిళలు మంగళవారం ఆందోళన నిర్వహించారు. అధికారులు అసలైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయలేదని తాము ఎన్నో ఏళ్లుగా ఇల్లు లేక ఇబ్బంది గురవుతున్నామని వారు గ్రామంలో రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న అధికారులు అక్కడికి వెళ్లి తిరిగి సర్వే నిర్వహించి తప్పకుండా న్యాయం చేస్తామని వారికి హామీ ఇచ్చారు.