25-06-2025 06:46:22 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) వేమునూరు ప్రభుత్వ పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు పూర్వ విద్యార్థి, జేఎన్టీయూ న్యూఢిల్లీ అసోసియేట్ ప్రొఫెసర్ తాళ్లపల్లి మహేందర్ నవోదయ ఎంట్రన్స్ స్టడీ మెటీరియల్ అందజేశారు. అలాగే పాఠశాలకు ప్రింటర్ అందజేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు సృజనాత్మకత ఎక్కువ ఉంటుందని, ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారు గొప్పవారు అయ్యారని, ప్రభుత్వ పాఠశాలలో చదవడం అదృష్టంగా భావించాలని పిలుపునిచ్చారు. చదువుకు పేద ధనిక బేధం లేదని, ఇష్టంతో చదివితే గొప్ప స్థాయికి చేరుకోవచ్చని ఉద్భోదించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్మాస్టర్ చీకటి ఉపేందర్, ఉపాధ్యాయులు రమేష్, వెంకటేశ్వర్లు, అశ్విని, సుచరిత పాల్గొన్నారు. గతంలో పాఠశాలకు మినరల్ వాటర్ ప్లాంట్ అందజేసిన మహేందర్, విద్యార్థుల ఉన్నతికి తన వంతు సహకారం అందిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.