25-06-2025 06:51:36 PM
వలిగొండ (విజయక్రాంతి): భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి(MLA Kumbam Anil Kumar Reddy) హైదరాబాద్ లోని జలసౌదాలో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy)ని కలిసి భువనగిరి నియోజకవర్గంలోని వలిగొండ మండలంలోని భీమలింగం కాలువకు నిధులు కేటాయించాలని కోరడం జరిగింది. అదేవిధంగా నియోజకవర్గంలోని బీబీనగర్, భువనగిరి మండలాలకు సంబందించిన బోల్లేపల్లి, పోచంపల్లి మండలానికి సంబందించిన అలీనగర్ కాలువల మరమ్మత్తులకు నిధులు కేటాయించాలని కోరారు. మూసీ వాగుకు సంబంధించిన అన్ని ఫీడర్ కాలువలలో గుర్రపు డెక్క ఆకు తొలగించుటకు, నిర్వాహణకు ప్రతీ సంవత్సరం 1 కోటి 20 లక్షల బడ్జెట్ కేటాయించాలని కోరారు.