25-06-2025 06:43:42 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి(MLA Alleti Maheshwar Reddy)ని విమర్శిస్తే సహించేది లేదని బీజేపీ సీనియర్ నాయకులు రామ్నాథ్, తాజా మాజీ జడ్పీటీసీ తక్కల రమణ రెడ్డి హెచ్చరించారు. బుధవారం ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ... ప్రజలు 50 వేలకు పైగా మెజారిటీతో గెలిపించిన ఎమ్మెల్యేపై కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేయడం సరికాదని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు ఇకనైనా బుద్ధిగా ఉండాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మెడిసెమ్మ రాజు, ఒడిసెల అర్జున్, ఆకుల కార్తీక్, సుంకరి సాయి, పద్మాకర్, గిల్లి విజయ్, నరేష్, కొండాజి శ్రావణ్, గంజి రాజు, గంగాధర్, లింగయ్య, రాము, ప్రసాద్, ఈర్ల విజయ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.