ఫైర్ సేఫ్టీపై ప్రజల్లో అవగాహన పెంచాలి
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజల్లో విస్తృత చైతన్యం కలిగించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు. అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు జరగనున్న వారోత్సవాలను సమర్థవంతంగా, ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. అగ్నిప్రమాదాల నివారణలో ముందస్తు జాగ్రత్తలు అత్యంత కీలకమని తెలిపారు.
విద్యాసంస్థలు, ఆసుపత్రులు, పెట్రోల్ బంకులు, షాపింగ్ కాంప్లెక్స్లు, జనసంచారం అధికంగా ఉండే ప్రదేశాలలో అగ్నిమాపక పరికరాలు తప్పనిసరిగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించేందుకు సిబ్బంది సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. ప్రజల్లో ఫైర్ సేఫ్టీపై అవగాహన పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి ప్రభాకర్, అధికారులు శివాజీ తదితరులు, సిబ్బంది పాల్గొన్నారు.






