16 April, 2026 | 11:59 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత

15-04-2025 01:21 AM

మాజీ మంత్రి మల్లారెడ్డి 

మేడ్చల్, ఏప్రిల్ 14 (విజయక్రాంతి): 16 నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత  ఏర్పడిందని, ఆ పార్టీ నాయకులు సైతం పార్టీ వీడుతున్నారని మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నా రు. సోమవారం కీసర మండ లం చిర్యాల గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మల్లారెడ్డి సమక్షంలో బి.ఆర్.ఎస్ పార్టీలో చేరారు. వీరికి మల్లారెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలతో అధి కారంలోకి వచ్చిందన్నారు. ఇచ్చిన హామీలను సంపూర్ణంగా అమలు చేయడం లేదన్నారు. ఏ  ఎన్నిక వచ్చిన బి ఆర్ ఎస్ గెలుపు ఖాయం అన్నారు. చిర్యాల గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బండారి మధు యాదవ్, బండారి భాస్కర్ యాదవ్, మల్లారపు మురళి గౌడ్, గుండ్లపల్లి కిరణ్ గౌడ్, కోళ్ల శ్రీశైలం యాదవ్, కోళ్ల కిషన్ తో పాటు పలువురు బీఆర్‌ఎస్ లో చేరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్, పలువురు నాయకులు పాల్గొన్నారు.