17-02-2026 12:26:20 AM
అధికారులకు హైదరాబాద్ కలెక్టర్ హరిచందన ఆదేశం
సికింద్రాబాద్, ఫిబ్రవరి ౧6 (విజయక్రాం తి): ప్రజావాణి అర్జీల పరిష్కారంలో జిల్లా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ కలెక్టర్ హరిచందన దాసరి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరే ట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఈ. వెంక టాచారితో కలసి కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలనుస్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా ఆర్జీలపై అధికారులు శాఖల వారీగా పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
వాట్సా ప్ ద్వారా అందిన దరఖాస్తులను కూడా అదే ప్రాధాన్యత నివ్వాలని సూచించారు. పెండింగ్ అర్జీలపై శాఖల వారిగా సమీక్షించి అట్టి అర్జీలను వేగవంతంగా పరిష్కరించాలని ఆదేశిం చారు. సోమవారం జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో 238 ఆర్జీలు అందాయని కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో పిడి హౌసింగ్ అశోక్ చక్రవర్తి, రెవెన్యూ డివిజనల్ అధికారి రామకృష్ణ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటి, స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ జ్యోతి, జిల్లా సంక్షేమ శాఖ అధికారులు ఆశ న్న, కోటాజి, ప్రవీణ్ కుమార్ ,ఇలియస్ అహ్మద్, జి.ఎం.పరిశ్రమల శాఖ పవన్ కుమా ర్, జిల్లా అధికారులు, ఆర్జీదారులు, తదితరులు పాల్గొన్నారు.