17-02-2026 12:24:52 AM
ద.మ.రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ
సికింద్రాబాద్, ఫిబ్రవరి ౧6 (విజయక్రాం తి): దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ట్రెస్పాసింగ్ ఘటనలను అరికట్టడంతో పాటు రైలు, రోడ్డు రవాణా భద్రతను మరింత బలోపేతం చేయాలని జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ అధికారులను ఆదేశించారు. సోమవారం సికింద్రాబాద్లోని రైల్ నిలయం కార్యాలయంలో ఆయన రైలు ఆపరేషన్ల భద్రతపై విస్తృత సమీక్ష సమావేశం నిర్వహించా రు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జోన్ అంతటా రైళ్ల సాఫీగా నడిచేలా చేపడుతున్న భద్రతా చర్యలు, లెవల్ క్రాసింగ్ల వద్ద భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి సాధించాలన్నారు. ఈ సమావేశంలో అదనపు జనర ల్ మేనేజర్ సత్యప్రకాశ్, వీడి యో కాన్ఫరెన్స్ ద్వారా విజయవాడ, గుంతకల్, గుంటూరు, సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజన్ల డివిజనల్ రైల్వే మేనేజర్లు పాల్గొన్నారు.