17-02-2026 12:26:54 AM
మాజీ మంత్రి డాక్టర్ సి లక్ష్మారెడ్డి
మిడ్జిల్, ఫిబ్రవరి 16 : దైవభక్తి సన్మార్గం వైపు నడిపిస్తుందని మాజీమంత్రి డాక్టర్ సీ లక్ష్మారెడ్డి అన్నారు. మండలం పరిధిలోని వేముల గ్రామంలో మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ శివాంజనేయ దేవాలయంలో నిర్వహించిన శ్రీ శివ పార్వతుల కళ్యాణమహోత్సవానికి మాజీ మంత్రివర్యులు డా.సి.లక్ష్మారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా శివపార్వతులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ప్రతి ఏటా నిర్వహించే బండలాగుడు పోటీలకు ఒక లక్ష రూపాయల ఆర్ధికసాయం చేశారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు మాజీ మంత్రిని సన్మానం చేశారు.